మళ్లీ పట్టాలెక్కనున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌

– ప్రకటించిన పాకిస్థాన్‌
న్యూఢిల్లీ, మార్చి4(జ‌నంసాక్షి) : బాలాకోట్‌లో ఐఏఎఫ్‌ సర్జికల్‌ దాడుల తర్వాత రద్దయిన సంఝౌతా
ఎక్స్‌ప్రెస్‌ భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య మళ్లీ పరుగులు పెట్టనుంది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలు సర్వీసును పునరుద్ధరిస్తున్నట్లు పాకిస్థాన్‌ సోమవారం ప్రకటించింది. లా¬ర్‌-ఢిల్లీ నగరాల మధ్య ఈ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలు సర్వీసును ఫిబ్రవరి 28న పాక్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌ ప్రభుత్వం లా¬ర్‌ నుంచి సోమవారం, గురువారాలలో ఢిల్లీకి ఈ సర్వీసును నడుపుతుండగా.. భారత్‌ .. ఢిల్లీ నుంచి బుధవారం, ఆదివారాలలో రైలు సేవల్ని అందిస్తుంది. ఢిల్లీ నుంచి అట్టారీ సరిహద్దు వరకు, లా¬ర్‌ నుంచి వాఘా సరిహద్దు వరకు భారత్‌ ఈ సర్వీసులు నడుపుతుందన్న విషయం తెలిసిందే. సోమవారం దాదాపు 150 మంది ప్రయాణికులతో సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ లా¬ర్‌ నుంచి బయలుదేరినట్లు పాకిస్థాన్‌ రేడియో ప్రకటించింది. పుల్వామాలో ఫిబ్రవరి 14న జైషే మహ్మద్‌ ఉగ్రదాడి ఆత్మాహుతి దాడి అనంతరం లా¬ర్‌ నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రైలు సర్వీసును రద్దు చేయడంతో ఇరు దేశాల మధ్య ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారుల తాజా నిర్ణయం శుభపరిణామమని హర్షం వ్యక్తమవుతోంది. కాగా, 1976లో భారత్‌-పాక్‌ మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందంలో భాగంగా సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలు సర్వీసు ప్రారంభమైంది. సంఝౌతా అనే పదానికి హిందీలో ‘ఒప్పందం’ అనే అర్థం వస్తుంది. 1976లో జులై 22న రెండు దేశాల మధ్య తొలి సర్వీసు నడిపారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఆరు స్లీపర్‌ కోచ్‌లు, ఓ ఏసీ 3టైర్‌ కోచ్‌ ఉన్నాయి.