మళ్లీ పెరుగుతున్న బంగారం ధర

హైదరాబాద్‌; పసిడి మళ్లీ మిడిసి పోతోంది. బంగారం ధరలు మళ్లీ ఎగిసిపడుతున్నాయి. మొన్నటి వరకు 25 వేల దిగువకి వచ్చిన బంగారం ధర వారం రోజుల్లోనే పదహరు వందలు పెరిగింది. నగర బులియన్‌ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారేట్ల పది గ్రాముల బంగారం ధర రూ.27,390 పలుకుతోంది. 22 క్యారేట్ల పది గ్రాముల బంగారం ధర రూ.26,100గా ఉంది. కిలో వెండి ధర రూ.45,500కు అమ్ముడవుతోంది. దేశీయంగా బంగారం కొనుగోళ్లు పెరగడం, మే రెండో వారంలో అక్షయ తృతీయ రానున్నందున బంగారం ధర తిరిగి పుంజుకున్నట్టు నిపుణులు భావిస్తోన్నారు.

తాజావార్తలు