మళ్లీ బీజేపీలో చేరను: యెడ్యూరప్ప

బెంగళూరు, జనంసాక్షి: మళ్లీ బీజేపీలో చేరబోనని కేజేపీ అధినేత, కర్ణాటక మాజీ సీఎం యెడ్యూరప్పా అన్నారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో మళ్లీ బీజేపీలో చేరబోతున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు తీవ్రంగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను బీజేపీలో తిరిగి చేరబోనని తేల్చి చెప్పారు. సాధారణంగా ఎన్నికల్లో కేజేపీ విజయం సాధించక పోయిన యెడ్యూరప్పా కించిత్‌ బాధపడడంలేదు. రాష్ట్రంలో బీజేపీ ఉనికి కోల్పోయిందన్నారు. బీజేపీని మట్టి కలిపించాలని ఆయన గర్వంగా చెప్పుకుంటున్నారు.