మసాయి పేటఆజాది కా అమృత్ మహోత్సవ వేడుకలు

జనం సాక్షి వెల్దుర్తి:

 మసాయి పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆజాదిక అమృత్ మహోత్సవ  వేడుకలు మండల విద్య శాఖ   ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో  తపస్  రాష్ట్ర కార్యదర్శి దుబాషి భాస్కర్ పాల్గొని స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతో మంది దేశ భక్తులు తన, మన, ధన రూపేణా సమర్పణ చేసి భారతమాత మాతృభూమిని పరాయి పాలన నుండి విముక్తిని చేసినారు అని కొనియాడినారు, విద్యార్థులు  దేశభక్తి కలిగి ఉండాలని, చరిత్ర మరచిన  స్వతంత్ర సమరయోధుల గురించి నూతన విద్యా విధానం ద్వారా  పుస్తకాల్లో ముద్రించాలని  కోరడం జరిగింది. మాసాయిపేట ఎం ఇ ఓ యాదగిరి గారు మాట్లాడుతూ  స్వాతంత్ర ఉద్యమంలో  సుభాష్ చంద్రబోస్ పాత్ర మరువలేనిదని  ప్రపంచ చరిత్రలో జననం ఉండి మరణం లేని వాడు ఒక్కడే అని  తెలపడం జరిగింది. మాసాయిపేట ఉన్నత పాఠశాల  ప్రధానోపాధ్యాయులు ముంతాజ్ అలి, తపస్ తూప్రాన్ డివిజన్ ఇంచార్జ్  రంగారెడ్డి వివిధ సంఘాల నాయకులు  చల్లా లక్ష్మణ్, వెంకట్ రెడ్డి, సంతోష్,  హరి రంజాన్ శర్మ,శ్రీకాంత్ గౌడ్, ఉపాధ్యాయలు సమిత, సంధ్య రాణి, నాగేశ్వర్ రావు  మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు*