మహాత్మా జ్యోతిభా పూలే జాతీయ ఫెలోషిప్ అవార్డుకు ఎంపికయిన కట్టెకోలు దీపెందర్

దేశవ్యాప్తంగా వివిధ సామాజిక రంగాలలో కృషి చేసే ఉద్యమ నాయకులకు భారతీయ దళిత సాహిత్య అకాడమీ ఢిల్లీ వారు ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా అందజేసే మహాత్మ జ్యోతిబాపూలే జాతీయ ఫెలోషిప్ అవార్డుకు నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్ ను  ఎంపిక చేసినట్లు భారతీయ దళిత సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎస్పీ సుమంక్షర్ శనివారం లేఖ ద్వారా సమాచారం అందించారు. ఈనెల 11వ తేదీ ఆదివారం నాడు ఢిల్లీలో ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కట్టెకోలు దీపేందర్ మాట్లాడుతూ గత దశాబ్దకాలంగా తాను చేస్తున్న సామాజిక కృషిని గుర్తించి తనను ప్రతిష్టాత్మక మహాత్మ జ్యోతిబాపూలే జాతీయ ఫెలోషిప్ అవార్డుకు ఎంపిక చేసినందుకు భారతీయ దళిత సాహిత్య అకాడమీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు