మహిళ నిర్లక్ష్యానికి మనువడు బలి

  హైదరాబాద్‌: ఓ మహిళ నిర్లక్ష్యం తన మూడేళ్ల మనువడి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన అమెరికాలోని లూసియానాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. న్యూ ఓర్లియన్స్‌కి చెందిన డియోన్కా కెనడీ అనే మహిళ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది. బుధవారం రాత్రి తన దగ్గరున్న తుపాకీని తన మనవడి దిండు కింద పెట్టి పడుకుంది. ప్రమాదవశాత్తూ ఆ తుపాకీ పేలి బుల్లెట్‌ బాలుడి ఛాతిలోకి దూసుకెళ్లింది. వెంటనే బాలుడ్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. నిర్లక్ష్యంగా వ్యవహరిచినందుకు కెన్నెడీని పోలీసులు అరెస్ట్‌ చేశారు.