మాజీప్రధాని ఐ.కె గుజ్రాల్‌కు తీవ్ర ఆస్వస్థత

 

గుర్గావ్‌: నవంబర్‌ 24, (జనంసాక్షి):

మాజీ భారత ప్రధాని ఐ.కె గుజ్రాల్‌ తీవ్ర అస్వస్థతకు గురైనారు. అస్వస్థతకు గురైన ఐ.కె గుజ్రాల్‌ను ఆయన కుటుంబ సభ్యులు శనివారం రాత్రి గుర్గావ్‌లోని మెడిసిటీ ఆస్పత్రిలో చేర్చారు. గత కొంతకాలంగా ఆయన ఊపిరి తిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. అయితే శనివారం ఆయన పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రిలో చేర్చారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.