మాజీ ఎంపీ జీవితఖైదును సుప్రీంకోర్టు సమర్థించింది

న్యూఢిల్లీ: ఓ హత్యకేసులో మాజీ ఎంపీ ఆనంద్‌మోహన్‌కు పడిన జీవితఖైదును  సుప్రీంకోర్టు సమర్థించింది. బీహార్‌లో  1994లో జరిగిన గోపాల్‌గంజ్‌ డీఎం హత్య కేసులో మాజీ ఎంపీ ఆనంద్‌మోహన్‌ దోషిగా పేర్కొంటూ గతంలో పాట్నా హైకోర్టు జీవితఖైదును విధించింది. దీనిపై మాజీ ఎంపీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన జీవితఖైదును సమర్థిస్తూ కోర్టు ఈ రోజు తీర్పు నిచ్చింది.