మాజీ కో ఆప్షన్ సభ్యుడు పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే

మల్దకల్ జూలై14 (జనంసాక్షి) గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండలం పరిధిలో కుర్తి రావులచెరువు గ్రామానికి చెందిన మాజీ కోఆప్షన్ సభ్యుడు,తెరాస పార్టీ సీనియర్ నాయకుడు చిన్న సూల్తాన్ మియా గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ రాత్రి తుదిశ్వాస విడిచారు.ఈ విషయంతెలుసుకొని గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి గురువారం వారి స్వగృహం చేరుకుని చిన్న సూల్తాన్ మియా పార్థివదేహాన్ని పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఎమ్మెల్యే వెంట ఎంపిపిలు రాజారెడ్డి,విజయ్ కుమార్, సింగల్ విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి,మండల వైస్ ఎంపీపీ వీరన్న,మండలం పార్టీ అధ్యక్షుడు వెంకటన్న, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సవారన్న,
తెరాస పార్టీ నాయకులు ఆంజనేయులు, పటేల్ జనార్దన్ రెడ్డి, హమ్మద్, మహబూబ్ అలీ, నరేందర్, మధు,చిన్న కిష్టన్న, మల్డకల్, కురుమన్న, భాస్కర్ గౌడ్, ప్రభాకర్, భగవంతు ,ఖాజావలి నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.