మాజీ రాష్ట్రపతి కి ఘన నివాళి

మఖ్తల్ జూలై 27 (జనంసాక్షి) స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకుని ప్రాథమికోన్నత పాఠశాల నిడుగుర్తిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎక్కడో మారుమూల గ్రామం రామేశ్వరంలో జన్మించి దేశ అత్యున్నత పీఠం అయిన రాష్ట్రపతి పీఠం ను అధిరోహించిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం అని అన్నారు. పేపర్ బాయ్ గా ప్రయాణం ప్రారంభించి మన దేశానికి అణు పరీక్షలు నిర్వహించి అణు ఆయుధాలు గల ప్రపంచ దేశాలతో సమానంగా నిలిపి మిస్సైల్ మాన్ గా నిలబెట్టిన ఘనత అబ్దుల్ కలాంకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మారెడ్డి, ఉపాధ్యాయులు పద్మ, వెంకటప్ప, సుజాత, సలాం ఆంజనేయులు, శ్రీనివాస్ పాల్గొన్నారు.