మానవత్వం చాటిన అయిజ పోలీస్ శాఖ

అయిజ,జులై 16 (జనం సాక్షి):
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ పరిధిలో ఎస్సై నరేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆర్ & బి రోడ్లపై వర్షాల కారణంగా ఆర్, బి రోడ్లపై ఎత్తుతగ్గులు ఏర్పడడం వల్ల వాహనదారులకు రాకపోకలకు చాలా ఇబ్బంది ఉన్నందున మరియు ప్రజలకు నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నందున మానవత్వంతో ఐజ పోలీస్ శాఖ వారు రోడ్లపై ఎత్తుతగ్గులను మట్టితో లెవెల్ చేపించడం జరిగింది. కానీ వాస్తవానికి ఆర్ , బి రోడ్డు  ఆర్ ,బి
 రోడ్ శాఖ వాళ్ళు మరియు మున్సిపాలిటీ అధికారులు చేయాల్సిన పనిని ఐజ ఎస్సై నరేష్ కుమార్  మానవత్వంతో ఈ పని చేయించడం జరిగింది.
నరేష్ కుమార్ గారు మాట్లాడుతూ వాహనదారులకు మరియు ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి ప్రతి ఒక్కరు రోడ్లపై వాహనం నడిపేటప్పుడు అతి జాగ్రత్తగా నడపాలని ఎందుకంటే వర్షం వల్ల రోడ్లపై ఎత్తుతగ్గులు ఉండడం వల్ల వాహనదారులు కిందపడే అవకాశం ఉంటుందని కనుక ప్రతి ఒక్కరు అతి జాగ్రత్తగా వాహనాలు నడపాలని ఎస్సై నరేష్ కుమార్ ప్రజలకు తెలియజేశారు,
Attachments area