మానవత్వం చాటుకున్న ఇటికాల చిరంజీవి

అడ్డగూడురు మండలంలో పలు గ్రామాలలో సేవా కార్యక్రమాలు
జూలై    జనంసాక్షి : యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని పలు గ్రామాలలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుడిసెలు పెంకుటిల్లు కురుస్తున్నాయని విషయాన్ని వారికి తెలపగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు అండగా నిలిచిన మెర్సీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ మండల పరిధిలోని లక్ష్మీదేవికాల్వ, రాపాక(డి), కొండంపేట అడ్డగూడూరు పట్టణ, మంగమ్మగూడెం, గ్రామాలలో 27బాధిత కుటుంబాలకు వర్షం కురవకుండా వాన కవర్లు (పట్టాలు), నిత్యవసర సరుకులకు ఆర్థిక సహాయం అందజేసిన మెర్సీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చైర్మన్ టెలికాం అడ్వైజర్ కమిటీ మెంబర్ ఇటికాల చిరంజీవి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అడ్డగూడురు పట్టణ అధ్యక్షుడు పులపల్లి సోమిరెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు బండి మధు, రాపాక మాజీ సర్పంచ్ లింగాల సుధాకర్ రెడ్డి, అడ్డగుడురు మాజీ సర్పంచ్ గోలి రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మగాని లక్ష్మయ్య, బలెంల సురేష్, బోనుగా వెంకట్ రెడ్డి, కడారి రమేష్, పాక సింహాద్రి, ముక్కముల నర్సయ్య, చిప్పలపల్లి యాదగిరి, లింగాల రాంరెడ్డి, చిప్పలపల్లి పరుశరాములు, యువజన కాంగ్రెస్ తుంగతుర్తి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సూరారం నవీన్ కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు మర్రిశెట్టి మల్లేష్, బండారి ఉపేందర్, మందుల వెంకటేష్, చిప్పలపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.