మానవత్వం చాటుకున్న తోటి స్నేహితులు.

దౌల్తాబాద్ మండల పరిధిలో ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గొల్ల సిద్ధిరాములు యాదవ్ అనే యువరైతు ఇటీవల అప్పులు బాధ తీర్చలేక తన వ్యవసాయ పొలం వద్ద ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న సిద్ధిరాములు మిత్రులు 2002-03 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన తోటి స్నేహితులు గురువారం సిద్ధిరాములు కుటుంబానికి 30 వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. అనంతరం సిద్ధిరాములు స్నేహితులు మాట్లాడుతూ వారి కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యాదగిరి,రమేష్,రాజలింగం, స్వామి, నాగరాజు, రాములు, సత్యనారాయణ, అశోక్, భూపతిరెడ్డి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.