మానవత్వం చాటుకున్న సీరోలు ఎస్ఐ రమాదేవి..

డోర్నకల్ ప్రతినిది జూలై 15(జనం సాక్షి): మహాబుబాబాద్ జిల్లా, కురవి-మరిపెడ రహదారిపై
ఓ…మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి తిరుగుతుండగా విధినిర్వాహణలో బాగంగా ఆ..మార్గంలో తన వాహనంలో వెల్తున్న సీరోలు ఎస్ఐ రమాదేవి గమనించారు.
తన వాహనం ఆపి అతని వివరాలు తెలుసుకున్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం వారి కుటుంబ సభ్యులతో ఎస్ఐ రమాదేవి మాట్లాడారు. తమ కుటుంబసభ్యుని వివరాలు ఓ..ఎస్ఐ పోన్ లో తెలపడంతో ఆచూకీ తెలిసిన వారు ఒక్కసారిగా సంతోషంతో ఉప్పొంగిపోయారు. అతని..సమాచారం తెలపడమే కాకుండా అతని స్వగ్రామం భీమవరం వెళ్ళడానికి ఏర్పాట్లు చేసారు. ఆ..వ్యక్తికి ఆర్థిక సహాయం అందించి వాహనం ఏర్పాటు చేసి మరిపెడ బస్ స్టేషన్ లో దించారు. ఖమ్మం వెళ్ళి అక్కడినుంచి బీమవరం వెల్లేలా ఏర్పాటు చేసారు. దారిన పోయే తనను ఆదరించి.. ప్రశ్నించి.. ఆర్ధికసహాయం చేసి తన..ఇంటికి పంపుతున్న ఎస్ఐ రమాదేవి మానవత్వానికి, మంచిమనుసుకు ఆ..వ్యక్తి చేతులెత్తి దండంపెట్టారు.