మా’ ఆసోసియేషన్ నూతన కమిటి అద్యక్షుడిగా కొండ విజయ్ కుమార్

మాస్టర్స్ అథ్లెటిక్స్ నూతన అధ్యక్షులుగా కొండా విజయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు చందానగర్ పరిధి హుడా కాలనీలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో కొండా విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కు అనుబంధంగా పనిచేస్తూ తమ అసోసియేషన్ ద్వారా క్రీడలకు మరింత ప్రోత్సాహం అందజేయనున్నట్టు తెలిపారు. జనవరిలో నిర్వహించబోయే రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలను డిసెంబర్ 11వ తేదీన శేరిలింగంపల్లి పరిధి పీజేఆర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్ డగ్లస్ , లక్ష్మీనారాయణ, సితిజ , మల్లేశ్వర, శారద, అథ్లెట్లు పాల్గొన్నారు. కాగా మా అసోసియేషన్ ప్రధాన కార్యదర్షిగా నూనె సురేందర్, ట్రెజరర్ గా స్వాతి దర్మపూరి, ఉపాద్యక్షులుగా ఏసురత్నం, డగ్లస్, ఆర్గనైజింగ్ సెక్రటరిగా మానస,
జాయింట్ సెక్రటరీలుగా జితేందర్ పటేల్, జ్యోతి, కార్యవర్గ సభ్యులుగా సవిత, శైలజ, శివలీల, రాజు బాశెట్టి, శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు నియమితులయ్యారు