మిత్రుని కుటుంబానికి తోటి స్నేహితుల ఆర్థిక సహాయం

ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న తంగెళ్ల సుశీల గత 17న మరణించిన విషయం విదితమే. ఆమె కుమారుడి మిత్రులు స్నేహితుడికి అండగా ఉంటామని, అతనితో పాటు కలిసి మునగాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004-05 సంవత్సరం పదవ తరగతి పూర్తి చేసిన మిత్రుల బృందం 38వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఆదివారం సుశీల కుటుంబ సభ్యులకు అందజేశారు. భవిష్యత్తులోనూ తమ మిత్రునికి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 2003-04లో మునగాల జడ్పిహెచ్ఎస్ లో పదవ తరగతి చదివిన విద్యార్థులు నారగాని వీరబాబు, పంది జాను, కొండపల్లి మనోజ్, బండారు రామకృష్ణ, మాచర్ల ఆంజనేయులు, బచ్చలకూరి లక్ష్మయ్య, నెమ్మది వెంకటేశ్వర్లు, శంకర్, నాగరాజు, సుధాకర్, రవీందర్ బాబు తదితరులు పాల్గొన్నారు.