మీ వెన్నంటూ నేనుంటాను
-శివకాశి సేవ యువ సైన్యం వ్యవస్థాపకులు భూక్యా కాశీరం నాయక్
-భూక్య నందు కుటుంబానికి పరామర్శ
డోర్నకల్ ఆగస్టు-22 (జనం సాక్షి న్యూస్)
డోర్నకల్ మండలం హున్య తండా గ్రామంలో ఇటీవలే అనారోగ్య కారణాల దృష్ట్యా స్వర్గస్తులైన భూక్య నందు వారి కుటుంబానికి పరామర్శిస్తూ ప్రగాఢ సానుభూతి తెలిపిన శివాకాశి సేవ యువ సైన్యం వ్యవస్థాపకులు భూక్యా కాశీరం.అందులో భాగంగా వారి కుటుంబానికి తమ్ముడుగా ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో సుమన్,సుధాకర్, వాగ్య,శ్రీను,చందా, లాల్ సింగ్,లింగ, నాను,సాగర్,రాజు, పవన్,భావసింగ్, రాంబాబు,భిక్కు, గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.