ముందుకు దూసుకుపోతున్న మునుగోడు*

టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌) పార్టీకి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు.
ఊపందుకున్న మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  రాజు గౌడ్.
తాండూరు అక్టోబర్ 10(జనంసాక్షి)మునుగోడు ఉప ఎన్నికల టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  రాజు గౌడ్ (సుశీల్ కుమార్ గౌడ్) తాండూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అప్పూ నయీమ్ లతో కలిసి గడపగడపకు వెళ్లి తమ పార్టీ  అభ్యర్థిత్వాన్ని బలపరచాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రచారంలో భాగంగా మునుగోడులో చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి చక్కని స్పందన లభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రజలకందిస్తున్న సంక్షేమ ఫలాలే అభ్యర్థికి విజయానందిస్తాయన్నారు.