ముంబయికి చేరుకున్న బ్రిటన్ ప్రధాని
ముంబయి : బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ భారత్లో మూడు రోజుల పర్యటన కోసం ముంబయి చేరుకున్నారు. ద్వేపాక్షిక సంబంధాల బలోపేతంతోపాటు పలు అంశాలపై ఆయన ఈ పర్యటనలో దృష్టిపెట్టనున్నారు. అయితే ఇటీవలే ఆ దేశానికి చెందిన అగస్టా వెస్ట్ల్యాండ్ కంపెనీ హెలికాప్టర్ల కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని పర్యటనపై ఈ అంశం ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.