ముంబయిలో వంతెన కూలి ముగ్గురి మృతి
ముంబయి : ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే దారిలో నిర్మాణంలో ఉన్న ఒక వంతెనలోని కొంత భాగం కూలి ముగ్గురు మరణించారు. రాత్రి సమయంలో జరిగిన ప్రమాదంలో పలువురు గాయపడినట్లు సమాచారం. కూలిన వంతెన శిధిలాల కింద కూలీలు ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. గాయపడినవారిని చికిత్సకోసం కూపర్, దేశాయ్ ఆస్పత్రుల్లో చేర్చారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.