ముగా జీవాల పారుడు వ్యాధి నివారణ మందుల పంపిణీ
కొండపాక (జనంసాక్షి) సెప్టెంబర్02; మూగ జీవాలలో వొచ్చే వ్యాధుల నివారణ కై మందుల పంపిణీ శిబిరాన్ని పశ్ పోషకులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి అన్నారు. కొండపాక మండల కేంద్రము లో గొర్రెలకు, మేకలకు పారుడు నివారణ మందు పంపిణీ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ చిట్టీ మాధురి తో కలసి మేకలకు, గొర్రెల కు పారుడు నివారణ మందును వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూగ జివాలలో సోకే వ్యాధుల పట్ల రైతులకు అవగాహన కల్పించారు.పారుడు నివారణ మందు వెయ్యడం వల్ల జీవాలు వ్యాధి బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటాయన్నారు. రోగ నిరోధక శక్తి నీ పెంచుతుందని దీన్ని మండల గొఱ్ఱెల, మేకల కాపరులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో వేటర్నర్ డాక్టర్ మోహన్ లాల్, తెరాస నాయకులు బైరి రామకృష్ణ రెడ్డి , మంచాల కనకరాములు , తది తరులు పాల్గొన్నారు.
