ముదిరాజ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

జహీరాబాద్ ఆగస్టు 11 (జనంసాక్షి ) కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి జీవించాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు పిలుపునిచ్చారు. గురువారం కోహీర్ మండలంలోని దిగ్వాల్ గ్రామంలో ముదిరాజ్ భవన నిర్మాణానికి సొంత నిధులతో రూ.5 లక్షలను మంజూరు చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఈ  కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు నర్సింలు యాదవ్, విజిలెన్స్ మెంబర్ రామకృష్ణ బంటు, ఎంపీటీసీ బక్కారెడ్డి, ఉప సర్పంచ్ రియాజ్, తెరాస సీనియర్ నాయకులు సుభాష్ రెడ్డి, ఇజ్రాయెల్ బాబీ, సత్యం మీదిరాజ్, శివప్ప, సంపంత్, ముద్దశీర్, శివ ముదిరాజ్ తదితరులు ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు అల్గోల సత్యనారాయణ, ఉప కార్యదర్శి విరవో సత్యం, ప్రధాన కార్యదర్శి శంకర్, జగన్ ముదిరాజ్. ముదిరాజ్ యూత్ సభ్యులు వెంకటేష్, శివ కుమార్, ఆంజనేయులు, నర్సింలు, నవీన్ కుమార్, ప్రవీణ్, సాయి కుమార్, నారాయణ, గోపాల్ బాల్ రాజ్, అన్వేష్, మైపాల్, ప్రభు పాల్గొన్నారు.