ముదిరాజ్ ల ఆత్మ గౌరవ బహిరంగ సభను విజయవంతం చేయాలి.

ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు పిట్టల భూమేష్.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 6. (జనంసాక్షి) హైదరాబాదులో ఈనెల 8న జరిగే ముదిరాజుల ఆత్మగౌరవ బహిరంగ సభకు భారీ సంఖ్యలో ముదిరాజులు తరలివచ్చి విజయవంతం చేయాలని ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు పిట్టల భూమేష్ అన్నారు. శుక్రవారం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిట్టల భూమేష్ మాట్లాడుతూ ముదిరాజుల ఆత్మగౌరవ హక్కుల సాధన కోసం జరిగే బహిరంగ సభలో జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి ముదిరాజులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాణవేణి లక్ష్మణ్ ముదిరాజ్, కీసరి నాగరాజు ముదిరాజ్, పప్పు మోహన్ ముదిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్, గొడుగు నరసయ్య ముదిరాజ్,రామ్ గోపాల్ ముదిరాజ్, జంగంపల్లి శేఖర్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.