మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం.

చండూరు మండల ఇంఛార్జి గా డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ.
అచ్చంపేట ఆర్సీ,అక్టోబర్10,(జనంసాక్షి న్యూస్): జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కు నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల  నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు మునుగోడు నియోజకవర్గంలో ని  చండూరు మండల ఇంచార్జి గా బాధ్యత లు అప్పగించారు. ఇదే క్రమంలో  కాంగ్రెస్ పార్టీ తరపున ఉప  ఎన్నికల పోటీ లో బరిలో దిగిన అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపే లక్ష్యం గా డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్థానిక క్లస్టర్ ఇంచార్జి లతో సమావేశం అయ్యి అక్కడి  స్థానిక వివిధ అంశాలపై, కాంగ్రెస్ పార్టీ  గెలుపుకోసం  ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, బూత్ స్థాయి నుండి పార్టీ కోసం  అభిమానులు, వివిద స్థాయిలో ఉన్న పార్టీ నాయకులు పట్టుదలతో కాంగ్రేస్ పార్టీ  గెలుపు దిశగా పనిచేయాలని సూచించారు.