మునుగోడు సభకు బయలుదేరిన టిఆర్ఎస్ శ్రేణులు

శివ్వంపేట ఆగస్ట్ 20, జనంసాక్షి : మునుగోడులో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తలపెట్టిన భారీ బహిరంగ సభకు శివంపేట మండల టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం భారీగా తరలి వెళ్లారు. సభకు వెళ్ళిన వారిలో టీఆరెఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, జిల్లా పరిషత్ కోప్షన్ సభ్యుడు మన్సూర్, జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు హరికృష్ణ, పిఎసిఎస్  చైర్మన్ వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు రమాకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా, మండల పార్టీ కోశాధికారి బండారి గంగాధర్, మండల నాయకులు చింత స్వామి, బానోత్ రవి నాయక్, సికింద్లాపూర్ సర్పంచ్ సురేందర్ రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, నాయకులు గొర్రె వెంకట్ రెడ్డి, సత్యం, నరేందర్, అశోక్, శ్రీనివాస్,  బిక్షపతి మాజీ ఎంపీటీసీ నాగమణి బాలయ్య, పోచ గౌడ్, వీరేశ్, ప్రకాష్ వివిధ గ్రామాల సర్పంచులు చెన్నానాయక్, కన్నారం దుర్గేష్, నాగేశ్వర్ రావు, ఎంపీటీసీలు మండల ముఖ్య నాయకులు, పార్టీ అనుబంధ కమిటీల అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు తరలి వెళ్లిన వారిలో ఉన్నారు.