మున్సిపల్ వైస్ చైర్మన్ కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలిపిన బిఆర్ఎస్ నాయకులు*,

అలంపూర్ పట్టణం లో మున్సిపాల్టీ వైస్ ఛైర్మన్ శేఖర్ రెడ్డి  తండ్రి  సత్య రెడ్డి ( వయసు 78 ) అనారోగ్యంతో గురువారం మరణించారు . విషయం తెలుసుకున్న  బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే అబ్రహం తనయుడు డాక్టర్ అజయ్, రవి  ఖతార్ లు మున్సిపల్ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి  ఇంటికి వెళ్లి సత్య రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి, పూలమాల వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
డా.అజయ్ వెంట మున్సిపల్ చైర్ పర్సన్ .మనోరమ ,టౌన్ అధ్యక్షుడు వెంకట్రామయ్య శెట్టి ,ఆలయ మాజీ ఛైర్మెన్ జితేందర్ గౌడ్ ,సింగల్ విండో డైరెక్టర్ శ్రీనివాసులు ,దేవరాజు , గారిబు బాషా  మరియు బిఆర్ ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు ఉన్నారు..