మురుగు ముంపు సమస్యను త్వరలో శాశ్వత పరిష్కారం : రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి,

ఆర్కే పురం డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ ల్లో డ్రానేజీ ఉప్పొంగి రోడ్డు పై మురుగు నీరు ప్రవహిస్తున్నా విషయాన్ని స్థానిక యూత్ కాంగ్రెస్ నాయకుడు కళ్యాణ్ ద్వారా తెలుసుకున్న రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, వెంటనే స్పందించి అక్కడికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించి వెంటనే జిహెచ్ఎంసి అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించి, స్థానిక సూపర్ వైజర్ ను, అక్కడికి వచ్చి సమస్యను సమీక్షించారు. త్వరలోనే సమస్యను శాశ్వతంగా పరిష్కారం అవుతుంది చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో తలాటి రమేష్ నేత*, మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు *నానవాల జ్ఞానేశ్వర్ యాదవ్, శేఖర్ ముదిరాజ్, భాస్కర్ నాయక్, ప్రేమ్ నాయక్, కళ్యాణ్, అష్రప్, రవి నాయక్, శ్రావణ్, జహంగీర్, వంగాల శ్రీకాంత్ రెడ్డి* తదితరులు పాల్గొన్నారు.