మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన టీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు మల్లం అనిత
జూలై . జనంసాక్షి : మోత్కూరు మండలంలోని పొడిచేడు గ్రామంలో సిరిగిరి శంకరయ్య గురువారం తెల్లవారుజామున ఆకస్మికంగా మరణించారు. ఈ సందర్భంగా మృత దేహం పై టిఆర్ఎస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు మల్లం అనిత పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమం లో ఉపసర్పంచ్ కప్పే వెంకటేశం,టీఆర్ఎస్ నాయకులు చామకూరి వీరస్వామి, బండ చిన్న లింగయ్య, మల్లం సైదులు, కడమంచి రమేష్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Attachments area