మృతుని పార్థివదేహానికి పూలమాల సమర్పించి ఘన నివాళి అర్పించిన జడ్పీ వైస్ చైర్మన్,మాజీ జడ్పీటీసీ.,

కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని 9వ వార్డుకు చెందిన రిటైర్డ్ గ్రామ అభివృద్ధి అధికారి సంద కురుమూర్తి అకస్మాత్తుగా మృతిచెందగా విషయం తెలుసుకున్న జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ , మాజీ జడ్పీటీసీ పొగాకు విశ్వేశ్వర్ లు పార్థివ దేహానికి పూలమాల సమర్పించి ఘన నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి సంతాపం తెలియజేశారు. గ్రామ అభివృద్ధి అధికారిగా ఆయన ఈ ప్రాంతానికి చేసిన సేవలు మరువలేమని.. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.అనంతరం కుటుంబ సభ్యులను కలిసి మనోధైర్యం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో  అమడబాకుల సర్పంచ్ బుచ్చన్న,మత్స్య కార్మిక సంఘం అధ్యక్షులు సంద రంగ స్వామి,మాజీ వార్డు సభ్యులు వెంకటస్వామి,తెరాస నాయకులు రాజశేఖర్, గోపి తదితరులు పాల్గొని పార్థివదేహానికి నివాళులు అర్పించారు.