మెట్ట ప్రాంతంలో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తహసిల్దార్ కు వినతి.
బూర్గంపహాడ్ సెప్టెంబర్02 (జనంసాక్షి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక పంచాయతీ పరిధిలోని భాస్కర్ నగర్ యస్ టి కాలనీ(చండ్ర పుల్లారెడ్డి నగర్), గాంధీనగర్ తదితర ప్రాంతాలలో వరదలు వచ్చిన ప్రతి సారి ముంపుకు గురవుతున్న వరద బాధితులకు మెట్ట ప్రాంతంలో ఇండ్ల స్థలాలను చూపించాలని తహసీల్దార్ భగవాన్ రెడ్డి ని కలిసి విన్నవించుకున్న వరద ముంపు బాధితులు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ముంపు బాధితులందరికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం ఎల్)న్యూడెమోక్రసి నాయకులు ముత్యాల సత్యనారాయణ, పున్నంచంద్, సామాజిక కార్యకర్త నల్లమోతు సురేష్, మహిళా సంఘం నాయకురాలు ఆదిలక్ష్మి, బట్టు రవి, పప్పుల జయ, సావిత్రి, సంధ్య, అలివేలు, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.