మెట్రో పంద్రాగస్ట్ ఫోకస్
న్యూఢిల్లీ,ఆగస్ట్14(జనం సాక్షి): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీ మెట్రో దేశభక్తిపూరిత సందేశాలను ప్రచారం చేయనుంది. స్వాతంత్య సమరయోధులతోపాటు పలువురు మహనీయుల చిత్రాలను మెట్రో బోగీలలో అమర్చి ఈరోజు నుంచి ప్రత్యేకంగా నడపనున్నారు. ‘మెట్రో’ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం ఈ రైలు రెండు నెలలపాటు సమయ్పూర్ బాదలీ, హుడా సిటీ సెంటర్ల మధ్య నడవడనుంది. ఈ ట్రైను బోగీలో మహాత్మాగాంధీ, భగత్సింగ్, సుభాష్ చంద్రబోస్, బీఆర్ అంబేద్కర్, లతా మంగేష్కర్, అబ్దుల్కలాం, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, కపిల్దేవ్ తదితరుల ఫొటోలను అమర్చారు. అలాగే అమర వీరులకు నివాళులు అర్పిస్తూ పలు అమూల్యమైన సందేశాలను పొందుపరిచారు. కాగా ఈ ట్రైన్ను వీక్షిచేందుకు ప్రయాణికులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.