మెడిసిన్ విద్యార్థి గాయత్రిని సన్మానించిన మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్

ఐజయ్య కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ….
వనపర్తి టౌన్ : డిసెంబర్ 5 ( జనం సాక్షి) వనపర్తి పట్టణానికి చెందిన 30వ వార్డు ఐజయ్య కాలనీ నివాసి అయిన రవి కుమార్ రెడ్డి శిల్పారెడ్డి కూతురు గాయత్రి రెడ్డి మెడిసిన్ లో 2003 ర్యాంకును,రామగుండం గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించిన సందర్భంగా వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్,ఐజయ కాలనీ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, ఘనంగా సన్మానించారు. వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ, ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలని గాయత్రిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, ఎమ్మార్వో కృష్ణయ్య, రాధాకృష్ణ,రాజు,వెంకటేశ్వర్లు, టీచర్ కొండశ్రీనివాస్ గౌడ్, రామ్మూర్తి,మోహన్ రెడ్డి, బాల్రెడ్డి, రాబర్ట్, వెంకటరమణ, భరత్ తదితరులు పాల్గొన్నారు.