మేడమ్‌ సుడిగాలి పర్యటన

గుజరాత్‌లో నిజమైన అభివృద్ధి కోసం పోరాటం: సోనియా
అహ్మదాబాద్‌,డిసెంబర్‌14(జనంసాక్షి) :
గుజరాత్‌ అభివృద్ది కోసమే తాము మార్పు కోరుకుంటున్నామని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. గుజరాత్‌/-లో అభివృద్ది వెనకబడి పెయిందని మరోసారి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. మొదటి విడత పోలింగ్‌ గురువారం ముగియడంతో రెండో విడత ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తాము
అధికారం కోసం కాదని….గుజరాత్‌ అభివృద్ధి కోసం పోరాడుతున్నామని ఆమె అన్నారు. అభివృద్ధి పేరుతో నరేంద్ర మోడీ గుజరాత్‌ ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. వచ్చే వారం రెండో విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో శుక్రవారం సోనియా ప్రచారం చేపట్టారు.కలోల్‌లో జరిగిన బహిరంగ సభలో సోనియా మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం గుజరాత్‌కు ఎన్డీయే ప్రభుత్వం కంటే యాభై శాతం ఎక్కువ నిధులు కేటాయించిందన్నారు. కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా వివిధ పథకాలు ప్రజలకు చేరటం లేదన్నారు. రాహుల్‌ కూడా వివిధ ప్రాంతాల్లో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అటు- మోడీ కూడా తన ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. తుది విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 17న గుజరాత్‌ శాసనసభ చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్‌ అభివృద్దిని మరింత బలపరచాలని మోడీ ఓటర్లను కోరారు.