మైనారిటీ సంక్షేమానికి కృషి చేయండి

` సీఎం రేవంత్‌తో ముస్లిం మతపెద్దలు
హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని శుక్రవారం పలువురు ముస్లిం మత పెద్దలు నాయకులు కలసి అభినందనలు తెలియచేశారు . డా.బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఆధ్వర్యంలో వచ్చిన  ముస్లిం మత పెద్దలు, నాయకులు సీఎంను సన్మానించారు. ఈ సందర్బంగా మైనారిటీల సంక్షేమమానికి చేపట్టాల్సిన చర్యలపై వారు పలు సూచనలను అందచేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, సి.ఎం.ఓ అధికారులు శివధర్‌ రెడ్డి, షా`నవాజ్‌ ఖాసీం తదితరులున్నారు