మైనార్టీ యువతకు ఉపాధి కల్పించడానికి 50 కోట్లు మంజూరు.,.

 నిధులు మంజూరుకు కృషిచేసి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ కు,సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు.,.                              జనంసాక్షి, కొత్త కోట, జూలై 16,.                    తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ యువతకు ఉపాధి కల్పించడానికి సీఎం కేసీఆర్ 50 కోట్లు మంజూరు చేశారని, ఇట్టి నిధులు మంజూరు చేయుటకు కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ కు కొత్తకోట మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్ ఖాజ మైనోద్ధిన్,కో ఆప్షన్ సభ్యులు వసీం ఖాన్ లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కొత్తకోటలో మైనార్టీ యువతకు ఉపాధి కల్పించడానికి దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి,కొత్తకోట మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేషిని విశ్వేశ్వర్ సహకారం తో మైనార్టీ రుణాలు ఇప్పించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.మధ్యవర్తుల ప్రలోభాలకు,మోసాలకు గురి కాకుండా నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.