మైసమ్మ కాలనీలో పర్యటించిన సర్పంచ్

(జనంసాక్షి)  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళక్ళలోకి నీరు చేరి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మండలకేంద్రంలోని మైసమ్మ కాలనీని సోమవారం సర్పంచ్ సురేందర్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్బంగా వర్షాల సమయంలో కాలనీ వాసులు ఎదుర్కొన్న పరిస్థితిని వివరించగా అధికారులకు చెప్పి పరిష్కరించేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట వార్డు సభ్యులు గిరీష్, కాలనీ వాసులు రాజు, రమేష్, నవీన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area