మోకాళ్ళ పై నిలబడి నిరసన తెలిపిన విఆర్ఏలు
స్టేషన్ ఘన్పూర్, జూలై 27 ,( జనం సాక్షి) :
విఆర్ఏలకు ఇచ్చిన హామీ మేరకు విఆర్ఏ ల సమస్యలువెంటనే పరిష్కరించాలని తహసీల్దారు కార్యాలయం ముందు విఆర్ఏలు చేపట్టిన సమ్మె మూడవరోజుకు చేరుకున్నాయి. సమస్యలు పరి ష్కరించాలని కోరుతూ విఆర్ఏలు మోకాళ్ళపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విఆర్ఏల జేఏసీ మండల అధ్య క్షుడు పాలెపు శ్రీనివాస్,మండల ప్రధానకార్యదర్శిఎలిశాలరాము మాట్లాడుతు సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చి న హామీలను వెంటనే అమలుచేయాలని కోరారు. విఆర్ఏలకు పేస్కెల్ జీఓను వెంటనే విడుదల చేయాలని,అర్వత కలిగినవిఆర్ఏలకుప్రమోషన్స్ కల్పించాలని 55 సంవత్సరములు నిండిన విఆర్ ఏల స్థానంలోవారసులకు ఉద్యోగాలుకల్పించాల ని అన్నారు.విఆర్ఏలకు ఇచ్చిన హామీలు పరిష్క రించాలని, లేనిఎడల హామీలు నెరవేర్చె వరకు సమ్మె కొనసాగుతుందని అన్నారు.ఈ సమ్మె కార్య క్రమంలో కోశాధికారి శివ,సభ్యులు రమ్య,జ్యోతి, యాదేశ్,వెంకట్రజం,అభి, రాజు కుమార్, సృజన్, పోతరాజు,అశోక్,మహేశ్వ రి,బాషబోయిన రాజు, నీల రాజు తదితరులు పాల్గొన్నారు.