మోడల్ స్కూల్ లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన:దౌల్తాబాద్ ఎంపీపీ గంగాధరి సంధ్య.

దౌల్తాబాద్, జూలై 21,జనం సాక్షి.
మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ మరియు కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎంపీపీ సంధ్యా ఆకస్మింగా తనిఖీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణ లో అసంపూర్తిగా ఉన్న వాటర్ టాంక్ నిర్మాణ పనులను పరిశీలించారు. తరువాత విద్యార్థులతో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజేందర్, దౌల్తాబాద్ మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.