మ్యాన్ హోల్స్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 20 : గద్వాల పట్టణంలోని పాతబస్టాండ్ సర్కిల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న మ్యాన్ హోల్స్ పనులను మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ బుధవారం ఉదయం పరిశీలించడం జరిగింది. ప్రధాన డ్రైనేజీల్లో పెద్ద ఎత్తున వ్యర్ధాలు పేరుకుపోయి వర్షపునీరు సులభంగా వెళ్లకుండా ఆటంకం కలుగుతున్న నేపథ్యంలో వాటిని తొలగించే పని గత కొన్ని రోజులుగా కొనసాగుతూనే ఉంది వ్యర్ధాలు ఎక్కడైఎక్కడ పోరుకుపోయాయో వాటిని గుర్తించి అలాంటి చోట్ల తొలగించే పనిని చేపట్టాలన్నారు వర్షాకాలం పూర్తి స్థాయిలో ప్రారంభం కాకముందే పనులు పూర్తి చేసి వర్షాపు నిరు ఎప్పటికప్పుడు సాపీగా ముందుకు వెళ్లేలా చూడాలన్నారు. పై కప్పులు వేసిన డ్రైనేజీలకు అవసరమైన చోటల్లా మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేసి వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
త్వరగా మ్యాన్ హోల్ పూడిక పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు కాంట్రాక్టర్లకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీమన్నారాయణ కృష్ణ శ్రీరాములు మహేష్ జములమ్మ ఆలయ కమిటీ డైరెక్టర్ కమ్మరిరాము టౌన్ యూత్ జనరల్ సెక్రటరీ వినోద్ తెరాస పార్టీ నాయకులు గోపాల్ మున్సిపల్ అధికారులు జవాన్లు తదితరులు పాల్గొన్నారు