యడ్యూరప్ప పుట్టిన రోజు పార్టీ ఇక లేనట్లే!

బెంగళూరు : కర్ణాటక జనతా పక్ష నేత యడ్యూరప్ప గత ఫిబ్రవరిలో 70వ పడిలో ప్రవేశించారు. అయితే పుట్టిన రోజు వేడుకలను మాత్రం ఎన్నికల ఫలితాలు వచ్చాక విజయోత్సవాలతో కలిపి మరింత ధూంధాంగా జరుపుకోవాలని ఆశించి వాయిదా వేశారు. కానీ పాపం, యడ్యూరప్ప అనుచరులు మంచి పార్టీ మిస్సయినట్లే. నిన్న ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి యడ్యూరప్ప ఎవరికీ కన్పించకుండా, ఫోను కూడా తీసుకోకుండా ఒంటరిగా ఇంట్లో ఉండిపోయారు. స్పష్టమైన అధిక్యం సాధిస్తామన్న నమ్మకంతో ఉన్న అయనకు అరడజను సీట్లు మాత్రమే లభించడం తట్టుకోలేని దెబ్బ మహా మహా నేతలంతా పరాజయం పాలవగా గుడ్డిలో మెల్లగా తాను విజయం సాధించినా సంతోషించలేని పరిస్థితిలో యడ్యూరప్ప ఉండిపోయారు.