యూపీఏ సర్కారు విఫలమైందని విమర్శించిన సీపీఎం

న్యూఢిల్లీ, జనంసాక్షి: పార్లమెంట్‌ సమావేశాలను సజావుగా నడపడంతో యూపీఏ సంకీర్ణ సర్కారు ఘోరంగా విఫలమయిందని సీపీఎం విమర్శించింది. ప్రభుత్వం మొండి పట్టుదలకు పోయి ప్రతిపక్షాల కనీస డిమాండ్లకు ఆమోదించకుండా పార్లమెంట్‌ స్తంభనకు కారణమయిందని తప్పుబట్టింది. అలాగే విపక్షాల అసంబద్ధ డిమాండ్లు కూడా ఒక కారణయని పేర్కొంది.