యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతిపై నివాళ్లు అర్పించిన నాగర్ కర్నూలు జిల్లా యాదవ సంఘం నాయకులు.

అచ్చంపేట ఆర్సీ, అక్టోబర్10,(జనం సాక్షిన్యూస్) : స్థానిక పట్టణం లోని అంబెడ్కర్ చౌరస్తా లో సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిసి సామాజిక వర్గ సీనియర్ రాజకీయ నేత ములాయం సింగ్ యాదవ్ మృతి చెందడం పట్ల నాగర్ కర్నూల్ జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటిస్తూ స్వర్గీయ ములాయం సింగ్ యాదవ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కుందేళ్ళ శంకర్ యాదవ్, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షలు కాశన్న యాదవ్, కౌన్సిలర్ రమేష్ యాదవ్, బెల్లి బాలరాజు యాదవ్, గడ్డం పర్వాతలు యాదవ్, గడ్డం నిరంజన్ యాదవ్, దొడ్ల నర్సయ్య యాదవ్, నూనె నారాయణ యాదవ్, బెల్లి తిరుపతయ్య యాదవ్, వావిల్లా తిరుతి యాదవ్, బత్కా సైదులు యాదవ్, గడ్డం లక్ష్మణ్ యాదవ్, జబ్బు నిరంజన్ యాదవ్, దొడ్ల మహేష్ యాదవ్, గడ్డం అజయ్ యాదవ్, వావిల్లా విష్ణు వర్ధన్ యాదవ్, బోడ గోపాల్ యాదవ్, వారిగంటి లింగామయ్య యాదవ్, బద్దుల విష్ణు యాదవ్, అంజి యాదవ్, బత్కా మధు యాదవ్, ఇతర యాదవ నాయకులు పాల్గొన్నారు.