రంగాపూర్, డిండి చింతపల్లి గ్రామాలకు చెందిన టి.ఆర్.ఎస్ మరియు కాంగ్రెస్,సి.పి.ఎమ్.

కార్యకర్తలు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సమక్షంలో బిజేపిలో చేరిక
జనం సాక్షి, వంగూర్:
బుధవారం జాతీయ బిసి కమిషన్ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి కల్వకుర్తి పట్టణంలో నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో బిజేపి వంగూరు మండలాద్యక్షుడు ఖానాపురం భాస్కర్ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు అల్లె భీమయ్య ఆధ్వర్యంలో రంగాపూర్ గ్రామానికి చెందిన అల్లె విజయ్, కుంభం లక్ష్మమ్మ,కుంభం వెంకటేష్,మర్రిపల్లి భారతయ్య, శివయ్య,మాడుగుల శ్రీను, రవి,శ్రీకాంత్,సి.హెచ్.నరసింహ, మర్రిపల్లి శేఖర్, వెంకటేష్ ముదిరాజ్,డిండి చింతపల్లి కి చెందిన సంకబుడ్డి పరమేష్ రెడమోని జానయ్య, శ్రీశైలం,ఎగిరి శెట్టి విష్ణు పలువురు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సమక్షంలో బిజేపిలోచేరారు.ఈకార్యక్రమంలోఒబిసి మోర్చ జిల్లా కార్యవర్గ సభ్యులు విప్పలపల్లి ఈశ్వర్ ,మండల ప్రధాన కార్యదర్శి చీమర్ల జగన్మోహన్ రెడ్డి నాయకులు కార్యకర్తలు నీలయ్యయాదవ్,సంతోష్ యాదవ్,ఓరెరాములు,నవీన్ రావు,స్వరూప్ రెడ్డి,నగేష్ గౌడ్, చంద్రమౌళి, గంజాయి శ్రీదర్,సురేందర్ తదితరులు పాల్గొన్నారు.