రఘునందన్ రావు ను భారీ మెజార్టీతో గెలిపించాలి: బిజెపి దౌల్తాబాద్ పట్టణ ఇన్చార్జి మార్కంటి నర్సింలు

దౌల్తాబాద్ మే 11(జనం సాక్షి )దౌల్తాబాద్ మండల కేంద్రంలో మెదక్ బిజెపి ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గెలుపు కోసం బిజెపి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. దేశ భవిష్యత్తు ఔన్నత్యం కోసం పక్క దేశాలతో స్నేహభావాన్ని పెంచుకుంటూ దేశానికి అవసరమున్న వాటిని దిగుమతి చేసుకొని దేశ ప్రజల యోగ క్షేమాలను రక్షించే నాయకుడు నరేంద్ర మోడీకి ఓటు ఓసి ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో బిజెపి దౌల్తాబాద్ పట్టణ ఇన్చార్జి మర్కంటి నర్సింలు,ఓబిసి మండల అధ్యక్షుడు తుమ్మల గణేష్, మండల ప్రధాన కార్యదర్శి కూర్మ గణేష్,బూత్ అధ్యక్షులు మొద్దు రాజు,ముత్యం గారి సతీష్, బిజెపి నాయకులు శ్రీనివాస్, కర్రోళ్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.