రజక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక.

కోటగిరి సెప్టెంబర్ 15 జనం సాక్షి:- కోటగిరి మండల కేంద్రంలోనీ విఠలేశ్వర మందిరం ఆవరణంలో గురు వారం రోజున నిజామాబాద్ జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో మండల రజక సంఘం నూతన కార్యవర్గనీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ ఎన్నికలో అధ్యక్షులుగా ప్యాట్ల పెంటయ్య,ఉప అధ్యక్షులుగా మేత్రి శివలాల్,
ప్రధాన కార్యదర్శి సంగెం శ్రీనివాస్ నియామకం అయారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు రజక సంఘం జిల్లా అధ్యక్షులు సిచ్.శేఖర్ వారికి పూలమాలలు వేసి,
శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.రజక సభ్యులందరు ఐక్యమత్యంగ ఉండి,సంఘం బలోపేతానికి కృషి చేస్తు,రాజకీయంగా ఎదుగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

తాజావార్తలు