రాజకీయాలకు అతీతంగా అభవృద్ది

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌19(జ‌నం సాక్షి): రాజకీయాలకతీతంగా అభివృద్ధి, సంక్షేమమే కేసీఆర్‌ లక్ష్యమని, ఇందులో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కోరారు. సామాజిక తెలంగాణ అభివృద్ధే టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రధాన లక్ష్యమని, ఆ దశగా సీఎం కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని ట్రైకార్‌ చైర్మన్‌ అన్నారు. నిరుపేద కుటుంబాలు పండుగలకు దూరంగా ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం తరుపున ఆర్థిక చేయూతనిస్తున్నారన్నారు. ఆశ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం రూ.6 వేలు వేతనం ప్రకటించి వారి జీవితాల్లో వెలుగులు నింపిందని పేర్కొన్నారు. ఒంటరి మహిళలకు సైతం జీవన భృతి అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం రాజకీయాలకతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్‌కు అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వంలోనే ముస్లిం, మైనార్టీలకు మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు.కేవలం ముస్లిం, మైనార్టీలే కాకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని చెప్పారు.