రాజకీయ పార్టీగా రాష్టీయ్ర బ్రాహ్మణ ఫ్రంట్
న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జనంసాక్షిఎ): రాష్టీయ్ర బ్రాహ్మణ ఫ్రంట్.. రాజకీయ పార్టీగా మారబోతోంది. రాష్టీయ్ర్ర బ్రాహ్మణ ఫ్రంట్ (ఆర్బీఎఫ్) జాతీయ అధ్యక్షుడు కాశీభట్ల సత్యసాయినాధ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీగా రూపుదిద్దుకుంటోంది. తమ సమస్యల పరిష్కారం కోసం గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బ్రాహ్మణ సంఘాలు ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా కాశీభట్ల మాట్లాడుతూ ప్రతి బ్రాహ్మణ కుటుంబం సైనికుల్లా పార్టీ కోసం పనిచేయాలని పిలుపు ఇచ్చారు. బ్రాహ్మణులంతా సహకరించాలని కోరారు. బ్రాహ్మణుల సమస్యలు జాతీయ స్థాయిలో పరిష్కరించే విధంగా ఆర్బీఎఫ్ ఒక శక్తిగా పనిచేస్తుందని కాశీభట్ల అన్నారు. రాజకీయపార్టీలు బ్రాహ్మణులను చిన్నచూపు చూస్తున్నాయని విమర్శించారు. బ్రాహ్మణుల హితం కోసమే ఆర్బీఎఫ్ అని కాశీభట్ల స్పష్టం చేశారు. బ్రాహ్మణులంతా ఏకమై తమ హక్కుల్ని కాపాడుకోవాలని, బ్రాహ్మణుల రక్షణ కవచంగా ఆర్బీఎఫ్ ఉంటుందని కాశీభట్ల పేర్కొన్నారు.