రాజస్థాన్‌  రాష్ట్రంలో దారుణ ఘటన

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. చేసిన ఎస్సై భూపేంద్ర సింగ్‌

రాజస్థాన్‌  రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రజలను రక్షించాల్సిన పోలీసే కీచకుడయ్యాడు. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన దౌసా జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దౌసా  జిల్లాకు చెందిన ఓ నాలుగేళ్ల బాలికను స్థానిక ఎస్సై భూపేంద్ర సింగ్‌ శుక్రవారం మధ్యాహ్నం తన రూమ్‌కు తీసుకొచ్చాడు. అక్కడే ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ రామచంద్ర సింగ్‌ తెలిపారు. కాగా, ఘటనపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.