రాజస్థాన్ లో దళిత విద్యార్థిపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన
జనంసాక్షి/రేగోడ్
రాజస్థాన్లో అమాయక దళిత విద్యార్థిపై కీచక టీచర్ చేసిన దాడిని ఖండిస్తూ మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు బందులు పాటించడం జరిగింది .ఈ సందర్భంగా మంగళవారం నాడు రేగోడు మండలంలోని అన్ని విద్యా సంస్థలకు బందుకు పిలుపు ఇవ్వడం జరిగిందని దళిత సంఘాల నాయకులు తెలిపారు ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ రాజస్థాన్లోని పాఠశాలలో విద్యార్థి ఉపాధ్యాయుడు బాటిల్లో నుంచి నీళ్లు తాగితే అతి క్రూరంగా దాడి చేయడం జరిగిందని దేశంలో ఇంకా దళితుల పైనా దాడులు జరుగుతూనే ఉన్నాయని అన్నారు.అలాగే బంద్ కు సహకరించిన ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలకు మరియు యాజమాన్యాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.