రాఫెల్‌ డీల్‌ వ్యవహారంలో మోడీయే సమాధానం ఇవ్వాలి

ముంబై,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి):  దేశ వ్యాప్తంగా రాఫెల్‌ ఒప్పందం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో మోదీపై వస్తున్న ఆరోపణలకు ఆయన మాత్రమే సమాధానం చెప్పాలంటూ బీజేపీ మిత్రపక్షం శివసేన  డిమాండ్‌ చేసింది. రాఫెల్‌ ఒప్పందంపై ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ ¬లెండ్‌  సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్‌ సహా ఇతర విపక్షాలు ఎదురుదాడికి సిద్దపడ్డాయి. రాహుల్‌ మాత్రం దీనిని తీవ్రంగా తీసుకుని విమర్శలను కూడా అంతే తీవ్రంగా సందిస్తున్నారు. కాగా ¬లెండ్‌ ప్రకటనతో రాఫెల్‌ ఒప్పందంపై దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారం చేలరేగుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు.ఈ దశలో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మరోమారు స్పందిస్తూ  రాఫెల్‌ ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం, రక్షణశాఖ మంత్రి కానీ సమాధానం చెప్పరని.. కేవలం ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే సమాధానం చెప్పాల్సిన అవసరమ ఉందని రౌత్‌ వ్యాఖ్యానించారు. ఎందుకంటే పూర్తి వివరాలు ప్రధానికి మాత్రమే తెలుసన్నారు. ప్రతిపక్షాలకు కాకపోయిన దేశ ప్రజల కోసమైన ఆయన మౌనం వీడి, ఆరోపణలపై స్పందించాలని ఆయన కోరారు. 25 ఏళ్ల క్రితం జరిగిన బోఫోర్స్‌ కుంభకోణమే మరోసారి భారత రాజకీయాలను పట్టిపీడిస్తున్నట్లు తనకు అనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. శరద్‌ పవార్‌ కూడా తాజాగా దీనిపై స్పందించారు. వివరాలు వెల్లడించడంలో తప్పులేదన్నారు.